లిక్కర్ కేసు నిందితులకు రిమాండ్ పొడిగింపు

లిక్కర్ స్కామ్ కేసులో 10 మంది నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల 18 వరకు రిమాండ్ పొడిగించింది. ఇవాళ్టితో నిందితుల రిమాండ్ ముగియనుండటంతో సిట్ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. అలాగే మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఫోన్‌ను FSLకు పంపేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఆయన ఫోన్‌ను అధికారులు సీజ్ చేసే అవకాశం ఉంది.