రేపటి నుండి ప్రారంభం కానున్న దసరా నవరాత్రులు. బెజవాడ కనకదుర్గ 11 రోజులు 11 అవతారాలు

రెపటినుండీ (22/09/2025) ఏపీలో దసరా శరన్నవరాత్రి ఉత్వవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. అందుకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్రం ప్రభుత్వం పూర్తి చేసింది. బెజవాడ కనకదుర్గ ఆలయం విద్యుత్ కాంతులతో పండగ శోభను సంతరించుకుంది.

Read Also : మళ్ళీ ఉత్తరాది – దక్షిణాది విభేదాల్ని రాజేసిన జీయస్టీ వ్యవహారం

ఇక ఈ నెల 29న మూలా నక్షత్రం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు, సహచర మంత్రులు ఆలయానికి వచ్చి ప్రభుత్వం తరపున  అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

Read Also : T సుబ్బిరామిరెడ్డి కంపెనీకి రూ. 5700 కోట్ల లోన్ మాఫీ.. ఇలా కూడా చెయ్యొచ్చా?

ఇక ఈ దసరా మహోత్సవం సందర్భంగా ఎప్పటి మాదిరిగానే అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకరంతో, మొత్తంగా 11 అలంకరణలతో పూజించనున్నారు.

విజయవాడ కనకదుర్గ ఆలయంలో అమ్మవారి అలంకారాలు :

సెప్టెంబర్ 22 : బాలా త్రిపుర సుందరీ దేవి

సెప్టెంబర్ 23 :  గాయత్రి దేవి

సెప్టెంబర్ 24 :  అన్నపూర్ణ దేవి

సెప్టెంబర్ 25 :  కాత్యాయని దేవి

సేవ్టెంబర్ 26 :  మహాలక్ష్మి దేవి

సెప్టెంబర్ 27 :  లలిత త్రిపుర సుందరీ దేవి

సెప్టెంబర్ 28 :  మహా చండి దేవి

సెప్టెంబర్ 29 :  సరస్వతీ దేవి (మూల నక్షత్రం)

సెప్టెంబర్ 30 : దుర్గా దేవి

అక్టోబర్ 01 : మహిషాసుర మర్ధిని

అక్టోబర్ 02 : రాజరాజేశ్వరి